నందిగామ : చందర్లపాడు మండల పరిధిలోని చింతలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్లను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెదేపా నాయకులు గ్రామస్తుల కోరిక మేరకు తిరునాళ్ల సందర్భంగా మంగళవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకున్న కేశినేని చారిటబుల్ ట్రస్ట్ అధినేత కేశినేని శివనాథ్(చిన్ని) ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో జరగాలని, మున్ముందు మంచి ప్రభుత్వం రావాలని ప్రజలకు అండగా నిలవాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులను స్థానిక తెదేపా నేతలతో కలిసి ఆయన అందజేశారు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు కేశినేని శివనాద్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు