– ప్రచారం ప్రలోభాలతో ఓటర్లను లొంగదీసుకుంటున్న్ రాజకీయ పార్టీలు….
– సెల్ ఫోన్లు తో పోలింగ్ కేంద్రాల్లో కి చొరబడుతున్న ఇతరులు, చోద్యం చూస్తున్న అధికారులు, సిబ్బంది….
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం లో 2024 సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికి అనగా సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ముందే పేపర్ ప్రకటన లో తెలియజేసిన అధికారులు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు కనీస అవసరాలైన అయిన నిలువ నీడ (టెంట్లు), త్రాగునీరు, బాత్రూం సదుపాయం కల్పించలేక పోయారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఓటింగ్ సమయంలో సెల్ ఫోన్ కలిగి వుండరాదు అనే నిభందనలు తోసి రాజంటూ ఇతరులు యధేచ్చగా సెల్ ఫోన్లు తో వివిధ చిత్రాలు చిత్రిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే వరకు ఓటరును వెంట తీసుకువచ్చి ప్రచారం, ఇతర తాయిలాలు తో వివిధ రాజకీయ పార్టీలు ప్రలోభ పెడుతున్నాను అధికారులు మౌనంగా వుంటున్నారు. ఇన్ని జరుగుతున్నాను చోడవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏమి చేస్తున్నారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరియైన బందోబస్తు లేక లైన్లు క్రమం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర విడనాడి కనీస సదుపాయాలు మాట దేవుడెరుగు, స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. పోలింగ్ ప్రారంభ నుండి 11 గంటలు వరకు సుమారు 22.6 శాతం ఓట్లు పోయినట్లు చోడవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అనకాపల్లి ఆర్డీఓ చిన్ని కృష్ణ తెలియజేసారు.