విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్ ): విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీగా ఎన్ఎస్ వీకే దుర్గారావు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వరాకా తిరుమలరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ డీఎ్సపీగా ఉన్నారు. దుర్గారావు గతంలో విజయవాడ టూ టౌన్ సీఐగా, ట్రాఫిక్-3 స్టేషన్ సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ జోన్ పరిధిలోని టూ టౌన్ స్టేషన్ సీఐగా పని చేసినప్పుడు మంచి పెరు పొందారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు నేరాల నియంత్రణ కోసం తనదైన శైలిలో పని చేసి అందరి మన్ననలు పొందారు.