విద్యార్థులకు ఒక వరం.. బాల్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ బుక్స్ పంపిణీ అనేది ఒక వరం లాగా మారడంతో పాటు మంచి మార్కులు పొందే అవకాశం ఉందని వార్డ్ ఇంచార్జ్ కోటిరెడ్డి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుందరయ్య నగర్ లో గల శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు బాలిరెడ్డి చేతుల మీదుగా మోడల్ టెస్ట్ పేపర్స్ బుక్స్ ను పంపిణీ చేశారు. హెచ్ఎం లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్స్ బుక్స్ కు అయ్యే ఖర్చును విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కోటిరెడ్డి బాలిరెడ్డి తన సొంత ఖర్చుతో విద్యార్థులకు విద్యాదానం చేయడం గొప్ప విషయం అని తెలిపారు. అనంతరం బాల్రెడ్డి మాట్లాడుతూ మార్చి 10వ తేదీన ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఈ మోడల్ బుక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అత్యధిక మార్కులు తేవడానికి తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతో సహకరిస్తుందని వారు తెలిపారు. కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పరీక్ష సమయంలో దగ్గర ఉన్నందున ఆటలకు, టీవీలకు స్వస్తి చెప్పి, చదువు మీదే చక్కటి శ్రద్ధ, ఆలోచన ఉంచాలని తెలిపారు. తదుపరి హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఈ మోడల్ బుక్స్ ను విద్యార్థులకు అందజేయడం పట్ల పాఠశాల తరఫున కోటిరెడ్డి బాలిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.