London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మన్యంజిల్లాలో 7లక్షల 75వేల 598 మంది ఓటర్లు

జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 7లక్షల 75వేల 598 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.తుదిఓటరు జాబితా ప్రచురణ ప్రతిని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాలలోని ఓటర్ల
జాబితాలో 3,78,764 మంది పురుషులు, 3,96,766 మంది స్త్రీలు, 68 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 7,75,598 ఓటర్లుగాఉన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయుటకు శాయశక్తుల కృషిచేశామన్నారు. మృతి చెందిన ఓటర్లను తొలగించడం, శాశ్వతంగా వలసలు వెళ్లినవారిని గుర్తించడం, యువతను ఓటరుగా నమోదు చేయడం, జంక్ ఓటర్లను సరిచేయడం, పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లను విచారణ చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించామని అన్నారు. బూత్ స్థాయి అధికారి నుండి శత శాతం దృష్టి సారించారని చెప్పారు.ప్రతీబుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమాచారం ఇచ్చి పుచ్చు కోవడం జరిగిందని తెలిపారు. ఫారం 8 దరఖాస్తులు దాదాపు 98 వేలు విచారణ చేశామనిచెప్పారు. జిల్లా ఏర్పడిన నాటికి దాదాపు 11వందల మంది యువ ఓటర్లు మాత్రమే ఉండగా జిల్లా యంత్రాంగం చేసిన కృషి కారణంగా ప్రస్తుతం 14 వేల వరకు ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు.
జిల్లాలోని పాలకొండ (ఎస్.టి) నియోజక వర్గంలో 94,328 మంది పురుషులు, 99,325 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్ వెరసి 1,93,667 మంది ఓటర్లు., కురుపాం (ఎస్.టి) నియోజక వర్గంలో 93,592 మంది పురుషులు, 99,005 మంది మహిళలు, 39 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు.పార్వతీపురం (ఎస్.సి) నియోజక వర్గంలో 92,655 మంది పురుషులు, 95,188 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని చెప్పారు.సాలూరు (ఎస్.టి) నియోజక వర్గంలో 98,189 మంది పురుషులు, 1,03,248 మంది మహిళలు, 4 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. .
జిల్లాలో 10,271 మంది మృతి చెందిన ఓటర్లు, 6674 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినవారు, 1093 మంది ఎక్కువసార్లు ఓటరుగా నమోదు అయినవారు, 2587 ఇతరులు ఉన్నట్లు రాజకీయ పార్టీలు పిర్యాదు చేయగా వాటన్నింటినీ విచారించిన తరువాత 1316 మంది ఓటర్లు మృతిచెందినట్లు, 382 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినట్లు, 358 మంది ఎక్కువసార్లు ఓటరుగా నమోదైనట్లు గుర్తించామని తెలిపారు.2,314 పిర్యాదులు అందక ముందుగానే విచారణ చేసి తొలగించామనిచెప్పారు. 16,255 మంది తమ చిరునామాలోనే ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె వెంకటరావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పారిశర్ల అప్పారావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి జి వెంకట నాయుడు, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి తామరఖండి వెంకట రమణ, సిపిఐ (ఎం) పార్టి ప్రతినిధి ఆర్ వేణు, వైఎస్సార్సీపీ ప్రతినిధి వి శ్రీనివాసరావు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి రవికుమార్, జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img