ఎం ఈ ఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ జీవో నెంబర్ 24/26-2-2023 ప్రకారం 25 శాతము ఉచిత ప్రవేశాలు కల్పించాలని ఎంఈఓ-1. రాజేశ్వరి దేవి, ఎంఈఓ-2. గోపాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ, హెచ్ఐవి వికలాంగులకు తప్పనిసరిగా ఒకటవ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పంపుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి అయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేయబడునని, ఏప్రిల్ 16వ తేదీన తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తప్పనిసరిగా జీవో నెంబర్ 24 అమలు చేయాలని వారు తెలిపారు. నిర్లక్ష్యము కానీ, ఫిర్యాదులు గాని అందితే కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలిపా రు.