: ఎమ్మెల్యే సీతక్క
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండు చేశారు. సోమవారం భారత్ బంద్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని మోదీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు బాధపడితే ప్రభుత్వం బాగుపడదని.. సీఎం కేసీఆర్ అనేక మాయ మాటలు చెప్పారని విమర్శించారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు.