విశాలాంధ్ర -వలేటివారిపాలెం :పవిత్రపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లో ప్రతి శనివారం జరిగే అన్నప్రసాదం కార్యక్రమానికి వలేటివారిపాలెం మండలంలోని పోలినేనిపాలెం గ్రామానికి చెందిన భూదాల నరసింగరావు వారి ధర్మపత్ని సునీత శనివారం 30,000వేలు రూపాయలు ను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్బంగా మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆలయఅధికారులు ఆకాక్షించారు