Saturday, June 14, 2025
Homeజిల్లాలుఅనంతపురంశ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమదే

శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమదే

డాక్టర్ సాకే శైలజానాథ్
విశాలాంధ్ర- శింగనమల : చంద్రబాబుఇప్పటికైనా మారండి.మీడియా కార్యాలయాల మీద దాడు లేంటి?నూతన తరం మీద కూడా చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారని డాక్టర్ శైలజానాథ్ మీడియా సమావేశంలోమాట్లాడారు. రాయలసీమ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా అమరావతి రాజధాని అంటే ఎలాఅని మండిపడ్డారు.శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమదని,మళ్ళీ 45 వేల ఎకరాలు కావాలంటున్నారు దేని కోసమో చంద్రబాబు చెప్పాలన్నారు.
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోయారా? అని నీలాదీశారు.చంద్రబాబు వెన్నుపోటు దారుడని వెన్నుపోటు దినంలో ప్రజలు నినదించారన్నారు.
ఏమి సంబంధంలేని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ పై అక్రమ కేసు పెట్టడం పిరికిపంద చర్యఅని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని విమర్శలు చేయడం మంచిదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతుంటే వాటి పై మాట్లాడకుండా ఉండటమేమిటని మండిపడ్డారు.
వైయస్ జగన్ నాయకత్వంలో మళ్లీ మేము అధికారంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు