నిరుద్యోగ భృతి నిరుద్యోగ సమస్యలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలి
ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబి
విశాలాంధ్ర _అనకాపల్లి: స్థానిక నెహ్రూ చౌక్ ఆవరణలో అఖిలభారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్) చేపట్టిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కోసం దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై. బాబి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని లేకుంటే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక నామమాత్రానికి 16,300 డీఎస్సీ పోస్టులు మాత్రమే విడుదల చేసి లక్షల మందిని నిరుద్యోగులుగా మిగులుస్తున్నారు అని అన్నారు. వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల 36 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని
స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి 75% స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు .అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక విలవిల్లాడుతుంటే యోగాంధ్రా పేరుతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేసి ఆ బడి బస్సులలో ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు .మూడు రోజులు పాటు యోగాంధ్ర కోసం సెలవులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. యోగాంధ్ర వద్దని ఉద్యోగాంధ్ర ముద్దని అన్నారు. తక్షణమే ఇలాంటి ప్రచార కార్యక్రమాలు కాకుండా యువతకు ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందర్నీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు వేమల కన్నబాబు. వియ్యపు రాజు. జిల్లా సహాయ కార్యదర్శ జి ఫణీంద్ర కుమార్. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు. పి బాబ్జి. సింహాద్రి. జగదీష్ తదితరులు పాల్గొన్నారు