నిపుణుల కమిటీ
ప్రపంచంలో చాలా దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు డోసుల వ్యాక్సినేషన్ని కూడా పూర్తిచేసి బూస్టర్ డోసు(మూడు డోసు) వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యాట్ తన వద్ద బూస్టర్ డోసు రెడీ అంటూ ముందుకు వచ్చింది. ఇందుకోసం నిపుణుల కమిటీని కూడా సంప్రదించింది. కానీ నిపుణుల కమిటీ బూస్టర్ డోస్ సిఫారుసు ప్రతిపాదన తిరస్కరించింది. అలా సిఫారసు చేయాలంటే ముందుగా క్లినికల్ ట్రయల్స్ అవసరమని సూచన చేసింది. ఈ సూచన అన్ని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు వర్తిస్తుందని చెప్పింది.మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కూడా బూస్టర్ డోసుకి సిద్ధమవుతోంది.