Homeవ్యాపారంవివో ఎక్స్‌ ఫోల్డ్‌ 5 భారతదేశానికి వచ్చింది !

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 5 భారతదేశానికి వచ్చింది !

- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో తన అత్యంత ఆధునిక ఫోల్డబుల్‌ ఫోన్‌ అయిన వివో ఎక్స్‌ ఫోల్డ్‌5ను భారతదేశంలో విడుదల చేసింది. ఫ్లాగ్‌షిప్‌ పనితీరు, ప్రీమియం డిజైన్‌, ఏఐ ఆధారిత ఫీచర్లతో, ఇది ఫోల్డబుల్స్‌ కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. కేవలం 217 గ్రాముల బరువుతో, ఈ ఫోన్‌ సాధారణ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కంటే తేలికగా ఉంది. 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో ఇండియాలోని అతిపెద్ద, ప్రకాశవంతమైన ఫోల్డబుల్‌ డిస్‌ప్లే కలిగిఉంది. దీన్ని దీర్ఘకాలిక, స్థిరత్వం దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది భారతదేశపు ఫోల్డబుల్‌ ఫోన్లలో అతిపెద్ద బ్యాటరీ 6000 ఎంఏహెచ్‌తో వస్తుంది. దీనితో పాటు 80డబ్ల్యు డ్యుయల్‌ సెల్‌ వైర్డ్‌ ఫ్లాష్‌ చార్జ్‌, 40డబ్ల్యు వైర్లెస్‌ చార్జింగ్‌ కూడా ఉంది, ఇది అత్యంత శక్తివంతమైన రోజు నాటికీ సరిపోతుంది. ఇది 0.43 సెం.మీ. మందంతో అత్యంత సన్నని ఫోల్డెడ్‌ ప్రొఫైల్‌ కలిగి ఉంది. ఏరోస్పేస్‌ గ్రేడ్‌ మెటీరియల్స్‌ వాడటం వల్ల ప్రతి ఫోల్డ్‌ తేలికగా, మన్నికగా ఉంటుంది. పవర్‌ యూజర్ల కోసం, ఇది అనేక ఏఐ ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్‌ ను అందిస్తుంది. ధర రూ.1,49,999.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు