Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశవ్యాప్తంగా 166.03 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం నాటికి దేశంలో 166.03 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంట్లలోనే 28 లక్షల డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్‌ 94.37 శాతంగా అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,09,918 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,31,268 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్‌ 15.75 శాతంగా అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img