Homeజిల్లాలుతూర్పు గోదావరిమండలంలో పలువురికి ఉత్తమ ప్రతిభ అవార్డులు 

మండలంలో పలువురికి ఉత్తమ ప్రతిభ అవార్డులు 

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : మండలంలోని పలు శాఖలో  ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా ప్రశంస పత్రాలను అందుకున్నారు.

పోలీస్ డిపార్ట్మెంట్ లో జిల్లా స్పెషల్ బ్రాంచ్లో అత్యుత్తమ  ప్రతిభ కనబరిచినందుకుగాను            హెడ్ కానిస్టేబుల్ ఎస్. ఆర్ మోహన్ రావుకు, మండల ప్రజలకు సేవలు అందించడంలో ఉత్తమ ప్రతిభను చాటిన నిడదవోలు మండల అభివృద్ధి అధికారి  వి ఎస్ వి ఎల్ జగన్నాధ రావు కు బెస్ట్ ఎంపీడీవో అవార్డు, నిడదవోలు పురపాలక సంఘ ఉద్యోగి సత్య భరత్ కు ఉత్తమ సేవా ప్రశంస అవార్డు ,  పోలీస్ డిపార్ట్మెంట్ కు  అందించిన ఉత్తమ సేవలకు గాను నిడదవోలు ఎస్సై 2 జీ. పరమహంస కు ఉత్తమ సేవా ప్రశంసా పత్రములను జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మంత్రివర్యులు కందుల దుర్గేష్, జిల్లా ఎస్పి  చేతుల మీదుగా  ఉత్తమ సేవా ప్రశంసా పత్రలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు.  

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు