Homeఆంధ్రప్రదేశ్ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు

- Advertisement -

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుమారు రూ.3,500 కోట్ల విలువ కలిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు.నిందితుల సంస్థలు, కార్యాలయాలు, అనుబంధ ప్రదేశాలపై దాడులు నిర్వహించి ఆధారాలు సేకరించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 20 చోట్ల ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.

జైలులో 9 మంది నిందితులు
అంతేకాకుండా, ఈ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటికే పలువురు నిందితులను గుర్తించింది.ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. వీరిలో 12 మందిని అధికారులు అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్‌ (ఏ-30)లు బెయిల్‌పై బయటకు వచ్చారు.అయితే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్‌నాయుడు సహా మరో ఎనిమిది మంది నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు