విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 21వ తేదీన అనంతపురంలోని ఆర్.డి.టి స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అండర్ 19 రాష్ట్రస్థాయి జూడో పోటీలకు తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా విద్యార్థిని ఎన్. సాయి వైష్ణవి ఎంపికయింది అని జీవన్ జ్యోతి ఉన్నత పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థిని ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు సత్యసాయి జిల్లా చిగిచెర్ల గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుందని తెలిపారు.ఎంపికైన విద్యార్థినిని పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత, కరస్పాండెంట్ సిస్టర్ రిన్సీ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు జీవనజ్యోతి విద్యార్థిని
- Advertisement -
RELATED ARTICLES


