- Advertisement -
–అభినందించిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ఎంపీడీవో సాయి మనోహర్ సతీమణి జి. అపర్ణ గ్రూప్-2 ఫలితాలలో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి మనోహర్ మాట్లాడుతూ అపర్ణ తన స్వశక్తితో, ఎటువంటి కోచింగ్ లేకుండా ఎంపిక కావడం శుభదాయకమని తెలిపారు. తనకు చదువు పట్ల అమితమైన గౌరవము, ప్రేమ ఉందని తెలిపారు. అందుకే తాను అనుకున్న దానిని సాధించడం జరిగిందని తెలిపారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


