ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 80,641 నమూనాలను పరీక్షించగా, 2,068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య19,64,117కు చేరింది. ఇందులో 19,29,565 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులతో కలిపి 21,198 కరోనా యాక్టీవ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనాతో గడిచిన 24 గంటల్లో 22 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం , విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,354కి చేరింది.