Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర : రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర పన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను గాంధీ కుటుంబం గౌరవించిందని%ౌౌ% కానీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ ను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కొడంగల్‌ నియోజకవర్గానికి తుప్పు పట్టిందని విమర్శించారు. కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్‌ కు ఈ పరిస్థితి పట్టిందని ఎద్దేవా చేశారు. కొడంగల్‌ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని%ౌౌ% లేకపోతే నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి టీఆర్‌ఎస్‌ ను ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img