బెంగళూరు: అమెజాన్ ఇండియా ఈరోజు తన ఫ్లాగ్షిప్ బ్యూటీ డిస్కవరీ ఎక్స్పీరియన్స్ అయిన బ్యూటీవర్స్ను ప్రకటించింది. ఇది జూన్ 20న ముంబైలో జరగనుంది. ఇందులో అన్నయ పాండే, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మీరా కపూర్, ఊర్ఫీ జావేద్, మహీప్ కపూర్, సుశాంత్ దివిగర్ మరియు మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. మొట్టమొదటిసారిగా, బ్యూటీవర్స్ అమెజాన్.ఇన్లోని ఒక ప్రత్యేక స్టోర్ఫ్రంట్ ద్వారా ఆన్లైన్లో కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా, ఈ జూలైలో జరగబోయే అమెజాన్ పైమ్ డేకు ముందు, భారతదేశంవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వినియోగదారులు వేలాది బ్రాండ్లను అన్వేషించడానికి, కొత్తగా విడుదలైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, క్రియేటర్`ఆధారిత కంటెంట్ను యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది. “గత సంవత్సరం, బ్యూటీవర్స్ 1,400 మందికి పైగా హాజరైనవారిని మరియు బ్రాండ్లను ఒకచోట చేర్చింది, ఈ ఈవెంట్ తర్వాత వారి వ్యాపారంలో 1.6 రెట్ల వృద్ధిని వారు చూశారు. ఈ సంవత్సరం, మేము 2,000 మందికి పైగా హాజరైనవారిని, 70 బ్రాండ్లను, భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీలను, 600 మందికి పైగా క్రియేటర్లు మరియు పైమ్ మెంబర్లను ఒకచోట చేర్చుతున్నాము. దీనితో ఇది ఇప్పటివరకు జరిగిన వాటిలో మా అతిపెద్ద ఎడిషన్గా నిలుస్తోంది. బ్యూటీవర్స్ను మొట్టమొదటిసారిగా అమెజాన్.ఇన్కు విస్తరించడం ద్వారా, మేము ఆ అనుభవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అమెజాన్ ఇండియా, బ్యూటీ డైరెక్టర్ సిద్ధార్œ భగత్ అన్నారు.


