దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు భారీగా పెరిగి 46వేలకు చేరాయి. ఇందులో 31 వేల కేసులు కేరళలోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది.ఓనం పండగ తర్వాత భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక తాజాగా దేశవ్యాప్తంగా 17,87,283 కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా 46,164 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొత్తగా 607 మంది వైరస్బారినపడి మరణించారు. వైరస్ ప్రభావంతో మొత్తం 4,36,365 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 34,159 మంది వ్యాధి బారి నుంచి బయటపడ్డారు.ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,33,725 ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 60.38 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మొత్తం 51.31 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.