Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈనెల 12న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

ఈనెల 12న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని తారకరామాపురం, గుట్ట కింద పల్లి వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జేవీ. సురేష్ బాబు, ఏపీఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్యాధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 కంపెనీల కొరకు ఉద్యోగమేల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా అర్హులు అని తెలిపారు. నెలకు వేతనం 13 వేల నుండి 20వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాదు పెనుకొండ,పాలసముద్రం లో ఉద్యోగం చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఆధార్ కార్డు విద్యా అర్హత పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని తెలిపారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఇది ఒక మంచి అవకాశం అని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9182288465కు సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు