సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గం గంలోని ధర్మవరం పట్టణంలో 60 కోట్ల విలువైన 650-2 సర్వే నెంబర్లో జరిగిన భారీ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారుశ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ సారధి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మధు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని బెంగళూరు వెళ్లే రోడ్డు నందు గల 650-2 సర్వే నంబర్ లో 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పేదల పేర్లు చెప్పుకొని ప్లంబర్స్ యూనియన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుమ్మక్కై ఆ ప్రభుత్వ భూమిని అర్హులైన ప్లంబర్ల కు అందకుండా తమ బినామీ పేర్లతో ఆ భూమిని అంతా నొక్కేశారు అని తెలిపారు. వీరికి అప్పటి తాసిల్దార్ రమేష్ అవినీతి అక్రమార్కులకు పూర్తిగా సహకరించారు అని తెలిపారు. 1996 లో ప్లంబర్ అంతా ఒక యూనియన్ గా ఏర్పాటు చేసుకొని పట్టాల కోసం ప్రభుత్వాన్ని విన్నవించుకోగా వారికి మంజూరు చేసింది అన్నారు. అయితే సదరు భూమి మాది అంటూ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో అప్పటినుంచి అది పెండింగ్లో పడుతూ వచ్చిందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో భూమి యజమానులు ప్లంబర్స్ యూనియన్ రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని తీర్పునిచ్చింది అని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్లంబర్స్ యూనియన్ ముసుగులో అప్పటి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని భూమి యజమానులను బెదిరించి, మరోవైపు అసలైన ప్లంబర్స్ ని కూడా తొక్కి పెట్టేసి యూనియన్ పేరు చెప్పుకొని ముగ్గురు వ్యక్తులు దాదాపు 30 నుంచి 35 పట్టాలు తమ బినామీ పేర్లతో దోచేశారు అని తెలిపారు. అప్పటి అధికార పార్టీ వైసీపీ సహకరించినందుకు నజరానాగా అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులకు కూడా 10 పట్టాలు అప్పనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టాలు ఇచ్చినందుకు అప్పటి ఎమ్మార్వో రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ కూడా 21,24,66 నెంబర్ గల పట్టాలు బినామీ పేర్లతో కేటాయించి వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును సదరు తాసిల్దార్, అప్పటి కమిషనర్ కు నజరానాగా ఇచ్చినట్లు సమాచారం అని తెలిపారు. 60 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి కేవలం యూనియన్ లోనీ ముగ్గురు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది అని, ఆ ముగ్గురిలో డి రాజు, డి సురేంద్రలు అన్నదమ్ములు కావడం విశేషం అని తెలిపారు. మరో వ్యక్తి ఎన్. లతీఫ్ లు ఉన్నారు అని, రూ. 60 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమిని యూనియన్ ముసుగులో తల్లి, తండ్రి, సోదరి, తోడల్లుడు, కూతురు, మరదలు, మేనల్లుడు, సోదరుడు, అత్త, స్నేహితుల పేర్లు పెట్టీ నిండా దోచేసారాన్నారు. వీరిపై చట్టబద్దంగా విచారించి అసలైన ఆ ర్హులకు విలువైన పట్టాలు అందేలా చర్యలు తీసుకొనీ సదరు వ్యక్తులపై 420 కేసులు నమోదు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవి సహాయ కార్యదర్శి రమణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పోలా లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, ప్లంబర్స్, భూ యాజమాన్యలు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో రూ. 60 కోట్ల విలువైన 650-2 సర్వే నంబర్ జరిగిన భారీ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించండి..
RELATED ARTICLES