Friday, May 3, 2024
Friday, May 3, 2024

గరిష్ట స్థాయికి చేరిన నిరుద్యోగం : కేజ్రీవాల్‌

న్యూదిల్లీ : నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గోవా యువతకు ఉద్యోగాలు లభించడం లేదని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.ఈ కారణం చేతనే గోవాలోని యువతకు ఉద్యోగాలు రావడం లేదని సోమవారం ట్వీట్‌ చేశారు. నిరుద్యోగ సమస్యపై గోవాలోని స్థానికులతో చర్చించడానికి త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానని ప్రకటించారు. ఇక పలుకుబడి, డబ్బులు ఉన్న కొందరికే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో ఆప్‌ తరపున అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తున్న కేజ్రీవాల్‌ అందుకు సంబంధించిన అన్ని ప్రయత్నాలు ఇది వరకే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గోవాలోని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైన పార్టీలకు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img