Monday, January 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన..

ధర్మవరంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన..

మంత్రి సత్తి కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా గృహ వినియోగదారులు అతి తక్కువ విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుంది అని, ఇంటి పై కప్పుపై కనీసం 10 చ.మీ/100 చ.అ స్థలంలో 1 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవచ్చు అని అన్నారు.ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసి, ప్రజలకు లబ్ది కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది” అన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సౌరశక్తి వినియోగం పెరిగి, విద్యుత్ బిల్లు తగ్గించే అవకాశాలు ఉంటాయన్నారు. సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ద్వారా అందరూ పర్యావరణ అనుకూలమైన శక్తిని ఉపయోగించి, విద్యుత్ వృథాను తగ్గించవచ్చు అని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రజల ప్రయోజనాలు పెరుగుతాయని, ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, టిడిపి నాయకులు చిగిచెర్ల ఓబిరెడ్డి, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు