Homeఅంతర్జాతీయంశ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం.. 123 మంది మృతి

శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం.. 123 మంది మృతి

- Advertisement -

130 మంది గల్లంతు
44 వేల మందికి పైగా నిరాశ్రయులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
శ్రీలంకకు అండగా నిలిచిన భారత్..

శ్రీలంకను దిత్వా తుపాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఇప్పటివరకు 123 మంది మరణించగా, మరో 130 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం ఈరోజు వెల్లడించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లు ధ్వంసం కావడంతో సుమారు 43,995 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించినట్టు డీఎంసీ డైరెక్టర్ జనరల్ సంపత్ కొటువెగోడ తెలిపారు. తుపాను శ్రీలంక తీరం నుంచి భారత్ వైపు కదులుతున్నప్పటికీ, దేశంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని కొలంబో గుండా ప్రవహించే కెలని నది ఉప్పొంగడంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఈ నది ప్రమాదకర స్థాయికి చేరడంతో వందల మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు.సాయుధ బలగాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయిఁ అని కొటువెగోడ మీడియాకు వివరించారు.

లంక‌కు భారత్ ఆప‌న్న‌హ‌స్తం
ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకొచ్చింది. బాధితుల కోసం ఇప్పటికే విమానంలో సహాయ సామగ్రిని పంపింది. శ్రీలంకలో ప్రాణనష్టం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఃఎక్స్ః వేదికగా హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. 2016లో సంభవించిన వరదల కన్నా ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు