ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
కొన్ని విమానాలను కోల్పోయినమాట నిజమేనన్న సీడీఎస్ అనిల్ చౌహాన్
ఇప్పటి వరకు దీనిపై నోరు విప్పని భారత్
కాంగ్రెస్ డిమాండ్.. పార్లమెంట్లో చర్చకు పట్టు
భారత్-పాకిస్థాన్ మధ్య గత మేలో జరిగిన సైనిక ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ాఐదు ఫైటర్ జెట్లు కూల్చివేయబడ్డాయి అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ సంఘర్షణలో అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే శాంతి స్థాపన జరిగిందన్న ట్రంప్ వాదనను భారత్ ఖండిస్తూ వస్తోంది. తమ ఆపరేషన్ సిందూర్ః సమయంలో రెండు దేశాల సైనిక అధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమే శాంతి ఒప్పందమని భారత్ స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై దేశానికి స్పష్టత ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసింది.
వాషింగ్టన్లో రిపబ్లికన్ సెనేటర్లతో జరిగిన డిన్నర్లో ట్రంప్ మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణలో ఐదు జెట్లు కూల్చివేయబడ్డాయి. ఇవి రెండు అణు శక్తి దేశాలు అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ జెట్లు ఏ దేశానికి చెందినవో ఆయన స్పష్టం చేయలేదు. ట్రంప్ వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేస్తూ మోదీజీ, ఐదు జెట్ల గురించి నిజం ఏమిటి? దేశానికి తెలుసుకునే హక్కు ఉందిఁ అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వాదనను 24 సార్లు పునరావృతం చేశారని, ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ నిశ్శబ్దంగా ఉండటం సరికాదని విమర్శించారు.
భారత్కు చెందిన ఆరు జెట్లు, అందులో మూడు రఫేల్ ఫైటర్ జెట్లను తాము కూల్చివేసినట్టు పాకిస్థాన్ తమ వైమానిక దళం ప్రకటించింది. అయితే, ఈ వాదనలను భారత్తో పాటు రఫేల్ తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ కూడా ఖండించారు. భారత రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కొన్ని విమానాలను కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత తప్పిదాలను సవరించుకుని పాకిస్థాన్లో 300 కిలోమీటర్ల లోపలికి వెళ్లి కచ్చితమైన దాడులు చేసినట్టు తెలిపారు. అయితే, కూల్చివేయబడిన జెట్ల సంఖ్యను భారత్ అధికారికంగా ఇంతవరకు వెల్లడించలేదు.
ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ నిశ్శబ్దంగా ఉండటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేసింది. ఁట్రంప్ ఈ వాదనను 70 రోజుల్లో 24 సార్లు చెప్పారు. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?ఁ అని జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.


