- Advertisement -
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డీ.డి. లాపాంగ్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
షిల్లాంగ్లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
లాపాంగ్ 1992 నుంచి 2010 మధ్య నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
తొలుత స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.


