Monday, January 20, 2025
Homeజిల్లాలుఅనకాపల్లిగోవాడ సుగర్స్ లో క్రషింగ్ శుభారంభం .…

గోవాడ సుగర్స్ లో క్రషింగ్ శుభారంభం .…

– లక్ష టన్నులు గానుగాట లక్ష్యం ….

విశాలాంధ్ర – చోడవరం ( అనకాపల్లి జిల్లా) : డిసెంబర్ 25, ది. చోడవరం సహకార చక్కర కర్మాగారం (గోవాడ) లో 2024-25 క్రషింగ్ సీజన్ కు గాను బుధవారం ఉదయం గం. 9.30ని.లకు చెరకు గానుగాటను ఎం.డి. వి. ఎస్.నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.డి. వి.ఎస్.నాయుడు మాట్లాడుతూ గత సంవత్సరం 14,447 రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, ఈ యేడాది 13,000 మంది సబ్య రైతులు దగ్గర చెరకు చెరుకు సరఫరా అగ్రిమెంట్ తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ యేడాది చెరకు మద్దతు ధర టన్ను కు రూ.3,151లు గా నిర్ణయించామన్నారు. గత ఏడాది చెరుకు సరఫరా చేసిన సభ్య రైతులకు 6 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఫ్యాక్టరీకి రావాల్సిన ఆదాయం సుమారు రూ. 9 కోట్ల వరకు ఉందని అన్నారు. అలాగే తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల ఫ్యాక్టరీ ప్రాంతాల నుంచి చెరుకు వస్తుందని తెలియజేశారు. ఈ సంవత్సరం వరి పంట రైతులకు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలతో పలు ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం చెరకు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ ఏడాది చెరకు క్రషింగ్ లక్ష్యం లక్ష టన్నులు కాగా, ప్రతి ఏడాది 50,000 టన్నులు చొప్పున క్రషింగ్ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ వెళతామని తెలియజేశారు. కార్మికులకు, కర్షకులకు బకాయిలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది క్రషింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు కార్మికులు, కర్షకులు సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిడిఓ కె. రామం, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు