వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.విద్యార్థులు నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజులను చెల్లించుకోవచ్చు.పరీక్షల వివరాలు: ఫిబ్రవరి 25న ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 26న సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.గత సంవత్సరాలతో పోల్చితే ఈసారి పరీక్షలను ముందుగానే నిర్వహించనున్నారు.థియరీ పరీక్షలకు ముందుగా, ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి.
పోటీ పరీక్షలకు అంతరాయం లేకుండా చర్యలు:
ఐఐటీ, ఎప్సెట్, నీట్ వంటి ప్రధాన పోటీ పరీక్షలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈసారి పరీక్షల షెడ్యూల్ను ముందుగా రూపొందించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఆలస్యంగా ఫీజు చెల్లించే వారికి డిసెంబర్ 15 వరకు రూ. 2000 లేట్ ఫీతో ఫీజులు చెల్లించే అవకాశం ఇవ్వబడింది.వచ్చే విద్యాసంవత్సరంలో ప్రధాన సంస్కరణలు:
వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంటర్ పరీక్షల విధానంలో మూలకమైన మార్పులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో, ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద బాయితో కలిసి మీడియాతో మాట్లాడిన అధికారులు ఈ వివరాలను తెలియజేశారు.
సిలబస్ మార్పులు:
వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంటర్లోని అన్ని సబ్జెక్టుల సిలబస్ను సవరిస్తున్నట్లు తెలిపారు.
గతంలో 2013-14లో మ్యాథ్స్, ఫిజిక్స్, బోటనీ, జూవాలజీ సబ్జెక్టులలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే 2019లో హ్యుమానిటీస్, 2021లో ఫస్ట్ లాంగ్వేజ్, 2018లో సెకండ్ లాంగ్వేజ్, 2020లో తెలుగు సబ్జెక్ట్ సిలబస్లో మార్పులు చేసినట్లు తెలిపారు.
ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా:
వచ్చే విద్యాసంవత్సరం నుండి ఎన్సీఈఆర్టీ నిబంధనలకు అనుగుణంగా అన్ని సబ్జెక్టుల సిలబస్లో మార్పులు చేయనున్నట్లు బోర్డు అధికారులు వివరించారు.ఈ ప్రక్రియను సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో 40 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.


