Thursday, January 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికీర్తిశేషులు ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు కొరకు సంకల్ప మండల దీక్ష చేపట్టిన నర్సింహులు

కీర్తిశేషులు ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు కొరకు సంకల్ప మండల దీక్ష చేపట్టిన నర్సింహులు

విశాలాంధ్ర ధర్మవరం : కీర్తిశేషులు ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ సంకల్ప దీక్షను బి ఎల్ నరసింహులు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాను తాసిల్దార్ కార్యాలయ ఆవరణ ముందు 41 రోజులు పాటు సంకల్ప మండల దీక్షలు చేపడుతానని తెలిపారు. తెలుగు రాష్ట్రానికి కీర్తిశేషులు ఎన్టీఆర్ చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని తెలిపారు. భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం వెనివెంటనే ప్రకటించాలని తెలిపారు. ఈ సంకల్ప మండల దీక్ష ఉదయం పదిగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిస్తానని తెలిపారు. ఈ దీక్ష పట్ల పలువురు మద్దతు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు