Homeజాతీయం'కేరళ' ఇకపై 'కేరళం'.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘కేరళ’ ఇకపై ‘కేరళం’.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -

కేరళ పేరును ‘కేరళం’ గా మార్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య చర్చ లేకుండానే ఆమోదముద్ర

కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో లేకపోవడంతో, ఆయన తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ‘కేరళ’ (పేరు మార్పు) బిల్లు, 2026ను ప్రవేశపెట్టారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలతో పాటు ఇతర కీలక అంశాలపై అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమనే బిల్లుకు సభ ఆమోదం ముద్రవేసింది.మలయాళంలో తమ రాష్ట్రాన్ని’కేరళం’ అని పిలుస్తారని, అధికారికంగా కూడా అదే పేరును ఖరారు చేయాలని కేరళ శాసనసభ 2024 జూన్‌లో తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, రాష్ట్రపతి ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపారు. 2026 జులైలో అసెంబ్లీ దీనికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో సవరణలు జరగనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు