- Advertisement -
అధ్యక్షులు అంకె రామాంజనేయులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని అయ్యప్ప దేవాలయమునకు అయ్యప్ప స్వామి బంగారు విగ్రహ పూతకు గాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు అంకె రామాంజనేయులు సభ్యులు నవకుమార్ వేణు తుకారాం నవీన్ లు కలిసి తమవంతుగా అయ్యప్పకు రూ.31,000 రూపాయలను విరాళంగా ఆలయ ట్రస్ట్ కు అందజేశారు. అనంతరం ట్రస్టు వారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారికి కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.


