- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు, కర్నూలులోని డి స్టేడియం నందు ఉత్సాహపరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల పీఈటి లక్ష్మీనారాయణ నిరుపేద క్రీడాకారులకు క్రీడా సామాగ్రి ఎల్లవేళలా ఉండాలన్న తలంపుతో వారి అమ్మానాన్నల జ్ఞాపకార్థం పదివేల రూపాయలను విరాళంగా అందజేశారు. అనంతరం షూటింగ్ బాల్ పోటీ నిర్వాహకులు పీఈటి లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.


