Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాపెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో కు వినతిపత్రం…

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో కు వినతిపత్రం…

- Advertisement -

విశాలాంధ్ర నందిగామ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆదేశాల మేరకు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఆర్డిఓకు పెన్షనర్ల సంగం ట్రెజరర్ వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో పెన్షనర్ల తో కలిసి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని డిఏ లు విడుదల చేయాలని పాత పద్ధతిలో ప్రకటించిన విధంగా డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అలాగే అన్ని ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ కార్డులపై ఉచిత వైద్యం అందజేయాలని అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పూర్వం లాగ 10% నుండి 15% పునర్దించాలని కోరుతూ మెమొరాండం అందించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండాది వెంకటేశ్వర్లు,కొంగర దుర్గాప్రసాద్,వెంకటరత్నం,ధర్మారావు, ఆంజనేయులు పలువురు పెన్షన్ దారులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు