- Advertisement -
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ష (ఆర్పిసి) ప్రతినిధులు హాజరయ్యి కొన్ని సూచనలు చేశారు. ఈ క్రమంలో లంక దుర్గాప్రసాద్ , సిమ్మా దుర్గారావు, ఎమ్. డి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొని ఓటర్ల జాబితా సవరణలు , కొత్త భవనాలు, పోలింగ్ స్టేషన్ల పనితీరు పై అధికార్లు చేసిన సూచనల్లో కొన్ని భద్రతా సంస్కరణలు అవసరం వుందని ప్రతిపాదించారు.


