ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ పోటీల్లో
ఎస్.కె.ఆర్. మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మొదటి స్థానం
జాతీయ స్థాయికి ఎంపిక
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఇటీవల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల స్థాయిలో బొమ్మూరు డిఫెన్స్ అకాడమీలో నిర్వహించిన ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ పోటీలలో ఎస్.కె.ఆర్. గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 160 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో, ఎస్.కె.ఆర్. కళాశాల విద్యార్థినులు 8 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే . గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న విద్యార్థినులు దక్షిణ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. రాఘవ కుమారి, శారీరక విద్యా విభాగాధ్యక్షురాలు వై. సుధారాణి, ఏ. నాగు, కిక్బాక్సింగ్ కోచ్ భవాని శంకర్. అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యురాలు డా. కె. నీరజలు విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు.


