- Advertisement -
చారిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ బిఅరెస్ వ్యతిరేకం
- గురువారం విచారణకు వచ్చే అవకాశం
- అడ్వాకేట్ అభిషేక్ సంఘ్వితో మహేష్ గౌడ్ భేటీ
విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం తీసుకువచ్చిన జీవో నెం 9పై హైకోర్టు స్టే ఎవ్వడాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం సుప్రీం కోర్టులో కేసు విచారణకు రావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్ల విషయంలో 40 పేజీలతో పిటిషన్ వేశామని, ప్రభుత్వం ఇచ్చిన జీవోను యధాతంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఓబిసి ల జీవితాలు బాగుపడాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు అడుగడుగునా బిజెపి, బి ఆర్ ఎస్ లు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ , జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధిస్తూ, పాత విధానంలో ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే ను, ఆర్డర్ ను చాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశమని పేర్కొన్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వితో ప్రత్యేకంగా సమావేశం అయ్యానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పి గురువారం లిస్ట్ అవుతుందని ఆశిస్తున్నామని వివరించారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, రాష్ట్ర అసెంబ్లీలో రెండు చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై మద్దతు పలికాయన్నారు. బీజేపీ, బిఆర్ ఎస్ లు ఇప్పుడు మాట మార్చి వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.


