విశాలాంధ్ర- ధర్మవరం : కొందరు విద్య ని అభ్యసించడానికి, మరికొందరు వాటి విలువలు శిష్యులకు నేర్పించడానికి పుడతారు, ఆ కోవకు చెందిన వారు ఎద్దుల తిప్పన్న
వీరు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ,డిగ్రీ కాలేజీ ధర్మవరం, జూనియర్ కాలేజీ, బుక్కపట్నం లో మాథ్స్ అసిస్టెంట్ గా ఉపాధ్యాయ రంగం లో పలు సేవలు అందించారు.ఎందరినో విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత ఎద్దుల తిప్పన్నకు దక్కుతుంది. ఉపాధ్యాయ రంగం మరువలేని వీరు సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కనిశెట్టిపల్లి గ్రామం లో ఆదెప్ప, అదెమ్మ దంపతులకు 12.6.1932లో జన్మించారు. బహు ముఖ ప్రజ్ఞావంతుడుగా పేరు పొందిన ఈ ఉపాధ్యాయ వ్యక్తిత్వం కలిగిన మంచి తనం కల మాష్టారు. విద్యార్థుల మనోభావాలు గమనించి ఆయన ఆనాడు విద్యా భోధన చేసే వారని ఆయన శిష్యులు పలువురు పేర్కొనడం విశేషం.తుదకు 17.6. 2017లో తను అందరికీ దూరమై స్వర్గస్తులయ్యారు..తన శిష్యులను అభిమానులను విషాదం లో ముంచారు.తల్లి తండ్రులు ఆదెప్ప,ఆదెమ్మ, దంపతులకు జనించిన మార్గ దర్శకులు ఉపాధ్యాయ వృత్తి కి తగిన న్యాయం చేసిన గురువు ఎద్దుల తిప్పన్న మృతి పట్ల ఎందరో అశ్రు నివాళులు అర్పించారు.ఇప్పటికీ మరువలేని కర్తవ్య పరాయణుడు తిప్పన్న అయ్యవారు అని పిలిచేవారు.ఆయనకు నలుగురు కుమార్తెలు, అనసూయ, దివంగత సుశీలమ్మ, రాజేశ్వరి, సాయి లీల, కుమారులు ఇద్దరు వారిలో విశ్రాంత ఇరిగేషన్ ఇంజనీరు అదిశేషయ్య, బాల మురళి కృష్ణ ఇంజినీర్ అనంతపురం వున్నారు.ధర్మవరం, బుక్కపట్నం,కొత్త చెరువు, అనంతపురం,తదితర ప్రాంతాలలో ఆయన పేరు తెలియని వారు లేరు. వీరి శిష్యులు ఇప్పుడు పెద్ద పెద్ద పదవులను అలంకరించిన వారున్నారు.తన శిష్యులకు ఆయన భోదించే విద్య తో పాటు క్రమశిక్షణ గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, చదువు విలువ, విద్య జ్ఞానం గురించి వివరించేవారు ఎవరినీ విసుగుకునేవారు కాదు. కోపం అనేది తెలియని వారు,అందరికీ సమయ స్ఫూర్తి తో సమాధానం ఇచ్చేవారు ఎద్దుల తిప్పన్న అందరికీ ఆదర్శం అని చెప్పాలి.వీరి సోదరులు శంకర నారాయణ విశ్రాంత హెడ్ మాస్టర్ గా వున్నారు. మరో సోదరులు దివంగత డా ఇ. సూర్య నారాయణ ధర్మవరం లో సాయిబాబా నర్సింగ్ హోమ్ స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అశీదించారు. సత్య సాయి బాబా భక్తులు, వీరు తల్లి తండ్రులు జ్ఞాపకార్థం కని శెట్టి పల్లి లో ఉచిత వైద్యం కేంద్రం ఏర్పాటు చేయడం విశేషం. ఇటువంటి వారి మార్గదర్శకంలో ఉపాధ్యాయులు నడవాలి.
ఉపాధ్యాయ వృత్తి కి న్యాయం చేసిన ఆదర్శ ఉపాద్యాయుడు ఎద్దుల తిప్పన్న
RELATED ARTICLES