Monday, January 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రీవెన్స్ డే అనేది ప్రజల సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం

గ్రీవెన్స్ డే అనేది ప్రజల సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం

…. ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం;; నియోజకవర్గంలోని తన పర్యటనలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రజల సమస్యను పరిష్కరించడమే నా లక్ష్యము అని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గ్రీవెన్స్ డే ను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను వైజ్ఞానికంగా సమీక్షించిన తర్వాత వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు తగిన ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల బోధన ఆహార విధానం పాఠశాల నిర్వహణను వారు సమీక్షించారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన భోజనంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని హెడ్మాస్టర్ను కు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహార మందకపోతే కఠిన చర్యలు తప్పమని కూడా హెచ్చరించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సర్కారు పథకాలను సక్రమంగా అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం ధర్మవరం పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ అయ్యప్ప భజన మందిరములో వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ కమిటీ హరీష్ బాబును ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు