విశాలాంధ్ర, పెద్దకడబూరు : మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మంగళవారం సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐ ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని బస్టాండ్ ఆవరణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ దళిత మహిళలకు రక్షణ కల్పించడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న దళితులకు, ప్రజలకు రక్షణ కల్పించాలని, మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేసి, వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య, రామాంజనేయులు, అమరేష్, పింజారి భాష, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.