విశాలాంధ్ర – పెద్దకడబూరు : పెద్దకడబూరు ఎస్ఐ మహేష్ కుమార్ ను గురువారం బీఎస్పీ నాయకులు పోలీసు స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామేలు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బోయ రవికుమార్, మంత్రాలయం నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎంపీ యువరాజు లు ఎస్ఐ మహేష్ కుమార్ కు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు. సన్మాన కార్యక్రమంలో నాయకులు బంగారప్ప, జాన్, హుస్సేన్ పీరా పాల్గొన్నారు.