విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సరం కంప్యూటర్ బ్రాంచ్ చదువుతున్న విద్యార్థిని కుమారి సుమ శ్రీ జస్వి భాగంలో స్టేట్ చాంపియన్ షిప్ ను సాధించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ నెలలో 15 నుండి 17 వరకు జరిగిన తేదీలలో ఐపిఎస్జిఎం రీజినల్ మీట్ నందు ప్రధమ బహుమతిని సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈనెల 4 నుండి ఆరవ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురం నందు నిర్వహించబడిన రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఐపిఎల్ పోటీలలో 13 ఉమ్మడి జిల్లాల విద్యార్థినీలతో పోటీపడి చెస్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం విద్యార్థిని శుభశ్రీ స్టేట్ శాంపియన్షిప్ సాధించి సదరన్ రీజియన్కు అర్హత సాధించడం జరిగిందన్నారు. ఇంతటి గణత సాధించిన విద్యార్థినికి ఆమెను తీర్చిదిద్దిన పీడీ ఇంచార్జ్ రాజేష్ ను ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.