నేటి నుంచి నాలుగో టెస్టు
న్యూదిల్లీ : భారత్`ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య 5మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా తరఫున కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాడా? ఓవల్ టెస్టులో అతడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్టాండ్బై పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ మూడు నెలలుగా టీమ్ఇండియాతోనే ఉంటున్నాడు. స్టాండ్బైగా సేవలు అందిస్తున్నాడు. అతడిని ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. బహుశా ఇంగ్లాండ్తో నాలుగో టెస్టులోనే అతడితో అరంగేట్రం చేయిస్తారని అనిపిస్తోంది. అలా కుదరకపోతే ఆఖరిదైన మాంచెస్టర్ టెస్టు ఆడటం ఖాయం. సీనియర్ పేసర్ల పనిభారం తగ్గించేందుకు జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వరుసగా మూడు టెస్టులు ఆడారు. రొటేషన్ పద్ధతిలో వారికి విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఉంది. దాంతో ప్రసిద్ధ్ కృష్ణను ప్రధాన జట్టులోకి తీసుకుంటామన్న యాజమాన్యం అభ్యర్థనను సెలెక్షన్ కమిటీ అంగీకరించింది. ‘‘జట్టు యాజమాన్యం అభ్యర్థన మేరకు సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవడం వల్ల యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రధాన జట్టులో చేరాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా 25 ఏళ్ల ప్రసిద్ధ్ ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచులు ఆడి 34 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఆరంభంలో టీమ్ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసి మూడు మ్యాచులు ఆడాడు. ఇంగ్లాండ్పై 6 వికెట్లు పడగొట్టాడు.