ఓవల్ : టీమిండియా కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు సాధించిన వేగవంతమైన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. 490 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ను చేరుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘనత నమోదు చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్లో, రికీపాంటింగ్ (ఆస్ట్రేలియా, 544), జాక్వెస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా, 551), కుమార సంగక్కర (శ్రీలంక, 568), రాహుల్ ద్రవిడ్ (టీమిండియా, 576), ఎం జయవర్దనె (శ్రీలంక, 645) ఈ ఫీట్ను అందుకున్నారు.