హైదరాబాద్ : ‘లవ్ స్టోరీ’ ఇచ్చిన సక్సెస్తో మంచి జోష్ మీదున్నాడు అక్కినేని వారి వారసుడు నాగచైతన్య. సాయి పల్లవి హీరోయిన్గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.8.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కరోనా లాక్డౌన్ తర్వాత తిరిగి తెరుచుకున్న థియేటర్లకూ ఈ సినిమా మంచి ఊపుతెచ్చింది. అయితే, సినిమా సక్సెస్ సందర్భంగా అక్కినేని నాగార్జున చిత్ర బృందానికి చిన్న పార్టీ ఇచ్చారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కేక్ కట్ చేశారు. ఆ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా హాజరయ్యారు. నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా పార్టీలో పాల్గొన్నాడు. శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కూడా వచ్చారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.