Monday, April 28, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యం..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాథం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, నిర్వాహకులు దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ శిబిరం దాసరి వెంకటేశులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం పట్టణంలోని తొగటవీధి లో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయములోని ఆవరణములో జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 273 మంది రోగులకు ప్రత్యేక వైద్య నిపుణులు చే వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చివర దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం వీరి కుమారుడు నారాయణస్వామి అండ్ సన్స్, దాసరి కమలాక్షి వ్యవహరించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ శిబిరంలో డాక్టర్ వివేక్ కుల్లాయప్ప, డాక్టర్ వెంకటేశులు, డాక్టర్ సాయి శ్వేత, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ విట్టల్, డాక్టర్ మహేష్, డాక్టర్ సతీష్ లు వైద్య చికిత్సలను అందించడంతోపాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన పలు అంశాలను రోగులకు వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి డాక్టర్ వినయ్ ద్వారా మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దాతలు మాట్లాడుతూ ఇటువంటి శిబిరంలో మమ్ములను భాగస్వామ్యం చేసిన కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి బండి నాగరాజు, పెద్దకోట్ల రాజు, పెద్దకోట్ల భాస్కర్, బండి ఆంజనేయులు, కాచర్ల నారాయణస్వామి మామిళ్ల అశ్వత్త నారాయణ, బండి సాయి, బండి పవన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు