Friday, May 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన..

స్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన..

గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఫై అవగాహనను టీచర్ వెన్నెల ద్వారా నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు తెలుగుప్రామాణికంగా తీసుకుంటూ, స్పోకెన్ ఇంగ్లీష్ బై మాట్లాడే విధానం ప్రతిరోజు అలవాటు చేసుకున్నప్పుడు సులభతరం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆంగ్లంపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు చక్కటి అవగాహన తో పాటు నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. తదుపరి ఆంగ్లమును సులభరీతిలోచదివించడం జరిగిందన్నరూ. తదుపరి కొంతమంది చిన్నారులతో పుస్తక పఠనం కథలు చెప్పించడం జరిగిందని తెలిపారు. ఇందులో గోవర్ధన్ అనే ఒక బాలుడు ఒక మంచి తెలుగు పాటలు పాడడంతో పిల్లలకు ఉత్సాహం తెప్పించడం జరిగిందన్నారు. ఆ పాట అందరిని ఆకట్టుకుందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 27 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు