Tuesday, May 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినీతి కథలు మంచి స్ఫూర్తిని ఇస్తాయి…

నీతి కథలు మంచి స్ఫూర్తిని ఇస్తాయి…

గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా నీతి కథలు మంచి స్ఫూర్తిని ఇస్తాయి అని గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతి తెలియజేశారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు ఆటలు, డ్రాయింగ్, వివిధ కళలను, యోగాను అభ్యసించాలని యోగా వలన చక్కటి ఆరోగ్యం, మనశ్శాంతి లభిస్తుందని తెలిపారు. టీచర్ వెన్నెల ద్వారా నీతి కథలు చెప్పడం, వాటి వలన కలుగు నీతులను తెలపడం జరిగిందన్నారు. ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 24 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు