: ఆదిములపు సురేష్
బద్వేల్ ఉపఎన్నికలో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. బీజేపీ పరిధిలో లేని హామీలు ఇస్తున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి. బద్వేలు ఉప ఎన్నికలో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారని అన్నారు.